ఖమ్మం: కొందరు వరదల్లో బురద రాజకీయం చేస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Minister Puvvada Ajay kumar) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏకధాటిగా కురిసిన వర్షాలతో ఖమ్మం (Khammam) నగరాన్ని మున్నేరు వాగు (Munneru Vaagu) ముంచెత్తిందని చెప్పారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. మున్నేరు వరద బాధిత కుటుంబాలకు పువ్వాడ ఫౌండేషన్ (Puvvada foundation) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్క్యాంపును మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఎంపీ నామా నాగేశ్వర రావుతో కలిసి వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వెయ్యి మందికి నిత్యావసర సరుకులు అందిస్తున్నామని వెల్లడించారు.
కాగా, మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీలు నామా నాగేశ్వర రావు, వద్దిరాజు రవిచంత్ర పర్యటించారు. మోతినగర్, జలగంనగర్, కేబీఆర్నగర్లో బాధితులను పరామర్శించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.