హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రవాణాశాఖలో ఆన్లైన్ సేవలను మరింత విస్తరించనున్నారు. ఇప్పటికే 16 సేవలను ఆన్లైన్లో అందిస్తుండగా మరో 8 సేవలను ఆన్లైన్ చేయడానికి ఉద్దేశించిన ఫైల్పై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదివారం నూతన సచివాలయంలోని తన చాంబర్లో తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడకు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు.