వనపర్తి : మాది పేదల ప్రభుత్వం. సామాన్యులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) అన్నారు. జిల్లా కేంద్రంలోని 3వ వార్డు పోచమ్మగుడి కాలనీలో వార్డు నిద్ర చేసి బుధవారం ఉదయం 1,2 వార్డులలో పర్యటించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అండగా నిలవాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్స్ పెంచుతామన్నారు. పేదలకు వంట భారం తగ్గించేందుకే రూ.400 సిలిండర్
ప్రతి కుటుంబానికి అందజేస్తామన్నారు. జిల్లాలో అన్యాక్రాంతమైన చెరువులను పునరుద్ధరించి ట్యాంక్ బండ్లుగా, మరుగునపడ్డ స్థలాలను పార్కులుగా తీర్చిదిద్దామన్నారు.11 పార్కులను అహ్లాదకరంగా తీర్చిదిద్ది ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రూ.425 కోట్ల ప్రత్యేక నిధులతో వనపర్తికి మిషన్ భగీరథ కింద తాగునీటి సరఫరా చేశామని పేర్కొన్నారు. ప్రజల జీవనప్రమాణాలు పెంచే విధంగా మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలన్నారు.