హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్)కు మరోసారి జాతీయ అవార్డు లభించింది. 2019-20 సంవత్సరానికి ఉత్తమ ప్యాక్స్గా నాస్కాబ్ అవార్డును సొంతం చేసుకొన్నది. చొప్పదండి ప్యాక్స్కు ఈ అవార్డు రావడం ఇది మూడోసారి. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. చొప్పదండి ప్యాక్స్ సభ్యులను ఆదివారం మంత్రుల నివాసంలో ఘనంగా సన్మానించారు. చొప్పదండి ప్యాక్స్ను ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలోని మిగిలిన ప్యాక్స్ ముందుకు వెళ్లాలని సూచించారు.