Palamuru Lift | నాగర్కర్నూల్ : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా వట్టెం వద్ద నిర్మిస్తున్న వెంకటాద్రి రిజర్వాయర్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, సీఎం ఓఎస్డీ స్మితా సబర్వాల్, ఎంపీ రాములు, ఇరిగేషన్ శాఖ అధికారులు పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. వట్టెంలో దాదాపు 90 శాతం పనులు పూర్తి అయ్యాయని తెలిఆరు. మిగిలిన 10 శాతం పనులను గరిష్టంగా మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్యాకేజ్ నెంబర్ 12 దగ్గర మిషన్ భగీరథ కెనాల్ను పరిశీలించారు. కెనాల్కు హైడ్రాలిక్ గేట్ల ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ ఇంజనీర్లను ఆదేశించారు.
ఈ బృందంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్, ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ రావు, సలహాదారు పెంటారెడ్డి, ఇరిగేషన్ సీఈ హమీద్ ఖాన్, ఎస్ఈ విజయ్ భాస్కర్ రెడ్డి, ఈఈ పార్థ సారథి, మేఘా కంపెనీ ప్రతినిధి ఉమామహేశ్వర రెడ్డి తదితరులు ఉన్నారు.