మేడ్చల్ : తెలంగాణ విద్యారంగం దేశానికి దిక్సూచిగా నిలిచిందని రాష్ట్రకార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Minister Mallareddy) అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన విద్యాదినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్(CM KCR) నాయకత్వంలో తెలంగాణ విద్యారంగం(Education Sector)లో విప్లవాత్మకమైన ప్రగతిని సాధించిందని పేర్కొన్నారు.
పదేళ్లకాలంలో దేశంలోని అన్ని పోటీ పరీక్షలలో తెలంగాణ విద్యార్థులే అధికంగా ర్యాంకులు సాధించి తెలంగాణ సత్తాను చాటుతున్నారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి కృషి వల్ల ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అన్యూహంగా పెరుగుతుందన్నారు. మన ఊరు-మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు పెరిగాయని వెల్లడించారు.
ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి, డిజిటల్ తరగతులు(Digital Classe), కంప్యూటర్ ల్యాబ్(Computer Labs)లు తదిరత అధునిక సౌకర్యాలనుసద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి రూ. 7300 కోట్లు కేటాయించడం విద్యార్థుల అదృష్టం అని చెప్పారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా విద్యాధికారిణి విజయకుమారి, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, మున్సిపల్ చైర్మన్లు ప్రణిత, కొండల్రెడ్డి, జడ్పీటీసీ అనిత, శైలజా, ఎల్లుబాయి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.