హైదరాబాద్ : మిల్క్ వెండర్ టు మినిస్టర్ స్థాయికి ఎదిగిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తన విజయ రహస్యాలు గురించి వివరించారు. కండ్లకోయ ఐటీ పార్కు శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి మల్లారెడ్డి విద్యార్థులకు విజయ సూత్రాలు చెప్పారు.
నా విజయానికి నాలుగు సీక్రెట్లు ఉన్నాయి అని మంత్రి తెలిపారు. టైం, డబ్బులు వృథా చేయొద్దు. రెస్పెక్ట్గా ఉండాలి. క్రమశిక్షణతో ఉండాలి. ప్రతి రోజు ప్లానింగ్ ఉండి, హోం వర్క్ చేస్తే గ్యారంటీగా సక్సెస్ అవుతాం. ఫ్రెండ్ షిప్ చేయొద్దు.. ప్రేమ చేయొద్దు. చాలా కష్టపడాలి. ఇతర దేశాలు అభివృద్ధి చెందుతున్నాయంటే వారు పక్కా ప్రణాళిక, హార్డ్ వర్క్తో ముందుకెళ్తున్నారు. అందుకే ఆయా దేశాలు ప్రపంచంలో ముందంజలో ఉన్నాయి. ప్రపంచాన్ని జయించే అవకాశం తెలంగాణ యువతకు ఉంది. మనకు బంగారం లాంటి సీఎం, మంచి ఐటీ మినిస్టర్ ఉన్నారు. అలా కేటీఆర్ దావోస్ వెళ్లి రాష్ట్రానికి పరిశ్రమలను ఆహ్వానించారు. మన హైదరాబాద్ ఐటీలో నంబర్ వన్లో నిలిచింది. టాప్ 5 కంపెనీలు హైదరాబాద్కు వచ్చాయి. ఈ ఘనత కేటీఆర్కే దక్కుతుందన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఆశీర్వాదంతో మంత్రి స్థాయికి ఎదిగాను అని మల్లారెడ్డి పేర్కొన్నారు.