మేడ్చల్ మల్కాజ్గిరి : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి దివ్యాంగులకు అండగా నిలిచారు. రోటరీ క్లబ్, మల్లారెడ్డి యూనివర్సిటీ తరపున 700 మంది దివ్యాంగులకు కృత్రిమ చేతులను ఉచితంగా అందించారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన దివ్యాంగులకు ఈ కృత్రిమ చేతులను అందించడం సంతోషంగా ఉందన్నారు. అమెరికాకు చెందిన హేలన్ అనే కంపెనీ తయారు చేసిన ఈ హ్యాండ్స్కు రూ. 7 కోట్లు ఖర్చు పెట్టినట్లు చెప్పారు. ఈ ఖర్చును రోటరీ క్లబ్, మల్లారెడ్డి యూనివర్సిటీ భరించిందని స్పష్టం చేశారు. బాధిత వ్యక్తుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తెలిపారు. ఒక్కో చేయి తయారీకి రూ. ఒక లక్ష ఖర్చు అయినట్లు పేర్కొన్నారు.
ఈ కృత్రిమ చేతుల ద్వారా 4 కేజీల బరువును మోసేందుకు వీలుగా ఉంటుందన్నారు. అంతేకాకుండా టూ, త్రీ వీలర్ వాహనాలను కూడా నడపడానికి ఉపయోగకరంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని తమ ఆధ్వర్యంలో చేయడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.
700 మంది చేతుల్లేని దివ్యంగులకు 7 కోట్ల వ్యయంతో మల్లారెడ్డి యూనివర్సిటీ మరియు రోటరీ క్లబ్ సంయుక్తంగా ఒక్కోకరికి 1 లక్ష రూపాయలతో కృతిమ చేతులను ఉచితంగా అందించడం జరిగింది.
ఇకపై ఈ 700 మంది దివ్యంగులు ఈ కృత్రిమ చేతుతో అందరిలానే అన్ని పనులు చేసుకోని ఆత్మవిశ్వాసంతో జీవిస్తారు@KTRTRS pic.twitter.com/cJ8kEBF5z9
— Chamakura Malla Reddy (@chmallareddyMLA) April 28, 2022
చేతుల్లేని 700 మంది దివ్యంగులకు 7 కోట్ల వ్యయంతో కృత్రిమ చేతి పరికరాలను అందించడం జరిగింది. pic.twitter.com/OIkOKxgghH
— Chamakura Malla Reddy (@chmallareddyMLA) April 28, 2022