హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా 52 దేశాల్లో ఉన్న బీఆర్ఎస్ ఎన్నారై శాఖల ప్రతినిధులతో శనివారం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారని బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. నవంబర్ 30న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియా వేదికగా నిర్వహించాల్సిన క్యాంపెయిన్పై ఎన్నారైలకు మంత్రి కేటీఆర్ పలు సూచనలు చేస్తారని వెల్లడించారు.
తమ పరిధిలోని కొన్ని నియోజకవర్గాలలో ఎన్నారైలు పర్యటించి సీఎం కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రచారం నిర్వహించనున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నారైలు అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రి కేటీఆర్ దిశానిర్దే శం చేయనున్నారని మహేశ్ బిగాల తెలిపారు.