హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణలోని పలు ప్రాంతాల ప్రజలు సాగునీటి కోసం, తాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో సాగిన సుదీర్ఘ ఉద్యమ ఫలితంగా 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యింది. అప్పటి నుంచి కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా మారింది.
రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు తదితర పథకాలతో తెలంగాణ పేదల జీవితాల్లో కేసీఆర్ ప్రభుత్వం వెలుగులు నింపింది. అదేవిధంగా మిషన్ భగీరథ పేరుతో బృహత్తర పథకం చేపట్టి కేసీఆర్ రాష్ట్ర ప్రజల తాగునీటి కష్టాలు తీర్చారు. అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద బహుళార్థసాధక సాగునీటి ప్రాజెక్టు అయిన కాళేశ్వరం నిర్మాణం పూర్తి చేసి తెలంగాణలో మెజారిటీ భూభాగానికి సాగునీటి సమస్యను పరిష్కరించారు.
ఈ నేపథ్యంలో ‘ది వైర్’ అనే వెబ్సైట్ ‘హౌ తెలంగాణాస్ ఏజ్ ఓల్డ్ థర్స్ట్ వాజ్ క్వించ్డ్ (తెలంగాణ దాహం ఎలా తీరిందంటే)’ శీర్షికన ఒక ఆర్టికల్ను ప్రచురించింది. ఆ ఆర్టికల్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) తన అధికారిక ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేశారు. మంత్రి ట్వీట్కు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తున్నది.
How Telangana’s Age-Old Thirst Was Quenched https://t.co/ZmeR8f1wfM
— KTR (@KTRBRS) March 4, 2023