హైదరాబాద్: గేయ రచయిత కందికొండ కుటుంబానికి గతంలోనూ అండగా ఉన్నామని, ఇకపైకూడా అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ అన్నారు. కందికొండ కుమార్తె మాతృక ట్వీట్పై మంత్రి స్పందించారు. కందికొండ ఇంటి విషయమై తమ సిబ్బంది మాట్లాడతారని, వారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో సమన్వయం చేస్తారన్నారు. తాము కిరాయి ఇంట్లో ఉంటున్నామని, తమకు చిత్రపురి కాలనీలో నివాసం కల్పించేలా చొరవ చూపాలని కందికొండ కుమార్తె మాతృక.. మంత్రి కేటీఆర్కు డిసెంబర్ 4న (శనివారం) ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.