Minister KTR | ఆత్మనిర్భర్ భారత్ ఓ నినాదమని.. ఆచరణలో మాత్రం అదానీ నిర్భర్ భారత్గా మారిందని ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ సెటర్లు వేశారు. దేశంలో అదానీ గ్రూప్నకు 200కు పైగా పోర్టులు, ఎయిర్ పోర్టులు, పవర్ స్టేషన్లు, సిమెంట్ ప్లాంట్లు, గనులు, రక్షణ రంగ పరిశ్రమలు, గ్యాస్ పంపిణీ నెట్ వర్క్, ఎలక్ట్రికల్ కంపెనీలు ఉన్నాయని ఓ నివేదిక తెలిపింది. దేశంలోని 23 రాష్ట్రాల పరిధిలో 87 శాతం భూభాగం పరిధిలో ఈ కంపెనీలు ఉంటాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో మంగళవారం మంత్రి కేటీఆర్ కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన ఆత్మనిర్భర్ నినాదం అదానీ నిర్భర్ భారత్గా మారిందని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ఈ శతాబ్దపు జోక్.. అవినీతి పరులను ఎవ్వరినీ వదలొద్దంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు ఈ శతాబ్దపు జోక్గా మంత్రి కేటీఆర్ అభివర్ణించారు.
AtmaNirbhar Bharat is the Slogan
AdaniNirbhar Bharat is the Reality #ModaniLoot pic.twitter.com/pIN7Du6isH
— KTR (@KTRBRS) April 4, 2023
అవినీతి పరులను ఎవరినీ కూడా వదలొద్దని సీబీఐ డైమండ్ జూబ్లీ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రసంగించారు. ఈ ప్రసంగంపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖలు కొందరికి మినహాయింపులతో అంటూ ఎద్దేవా చేశారు. అదానీ వ్యవహరంలో సీబీఐ సహా కేంద్ర నిఘా సంస్థలు ఏ మాత్రం స్పందించడంలేదని విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో.. మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
జై భీమ్, జై తెలంగాణ, జై భారత్.. జై భీమ్, జై తెలంగాణ, జై భారత్ అంటూ మంత్రి కేటీఆర్ అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ నెల 14న సచివాలయం సమీపంలో ఆవిష్కరించనున్న 125 అడుగులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వీడియోను మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో షేర్ చేశారు.
Jai Bhim ✊
Jai Telangana ✊
Jai Bharat ✊ https://t.co/8RQxCvYTDy— KTR (@KTRBRS) April 4, 2023
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల 28, 29 తేదీల్లో ఫుడ్ కాంక్లేవ్ -2023 నిర్వహించనున్నట్లుగా కేటీఆర్ తెలిపారు. ప్రగతి భవన్లో మంగళవారం ఫుడ్ కాంక్లేవ్ 2023 పోస్టర్ను కేటీఆర్ ఆవిష్కరించారు. కాంక్లేవ్లో 100 వరకు వ్యవసాయ, ఆహార సంబంధమైన ముఖ్యమైన ప్రతినిధులు చర్చల్లో పాల్గొంటారని వివరించారు. రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఈ కాంక్లేవ్ ద్వారా ఇండియా వ్యవసాయ, ఆహార రంగంలో ఉన్న అవకాశాలకు మెరుగుపడుతాయని అన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.