హైదరాబాద్: పెట్రో ధరల పెంపుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను మంత్రి కేటీఆర్ (Minister KTR) సూటిగా ప్రశ్నించారు. సెస్లు, క్రూడాయిల్ ధరలు తగ్గించడానికి పార్లమెంటులో చర్చలు నిర్వహించడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ట్విటర్ వేదికగా ప్రశ్నాస్తం సంధించారు. తాను చైనీస్ టార్చర్ గురించి పుస్తకాల్లో మాత్రమే చదివానని, కానీ కేంద్ర ప్రభుత్వం వరుసగా 14 రోజుల్లో 12 సార్లు లీటర్కు 80 పైసల చొప్పున పెట్రోల్ ధరలు పెంచి అన్ని రకాల టార్చర్లను తిరగరాసి ఒక కొత్త రికార్డు సృష్టించదని విమర్శించారు.
రాష్ట్రంలో తాము గత ఏడేండ్లుగా (2015 జనవరి నుంచి) తాము వ్యాట్ను పెంచలేదని చెప్పారు. ఎన్డీఏ పభ్వుతం విచాక్షణా రహితంగా పెంచిన సెస్సులను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నామని, దీనివల్ల ఇంధన ధరలు కనీసం 30 శాతం తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు.
Any to those who rant about how states can reduce state taxes, in Telangana we have not enhanced VAT in last 7 years (2015 Jan)
Our demand is to do away with indiscriminate Cesses imposed by NDA Govt which will lower fuel prices by 30% at least
— KTR (@KTRTRS) April 4, 2022