Minister KTR | వరంగల్ : పర్వతగిరి మండలం ఏనుగల్లులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఏనుగల్లుకు చేరుకున్న కేటీఆర్కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు( Minister Errabelli Dayaker Rao ) ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏనుగల్లులో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని( Cancer Screening Center ) మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ఏనుగల్లులో నైపుణ్యం కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. 30 పడకల ఆస్పత్రి కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు.
మంత్రి కేటీఆర్ మరికాసేపట్లో మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా తొర్రూరు (Thorrur) కు చేరుకుంటారు. మహిళా దినోత్సవ (Women’s day) కానుకగా రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులకు మొత్తం రూ.750 కోట్ల వడ్డీలేని రుణాలను, అభయహస్తం డబ్బులను చెక్కుల రూపంలో పంపిణీ చేయనున్నారు. 500 మందికి ఉచితంగా కుట్టుమిషన్లు అందిచనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.