హైదరాబాద్ : రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్న వారికి ఆపద్భాందవుడిగా నిలిచే కేటీఆర్ ఓ కుటుంబానికి అండగా నిలిచి తన సహృదయతను చాటుకున్నారు. సరస్వతి పుత్రికను కోల్పోయిన ఆ నిరుపేద తల్లిదండ్రులకు తోడుగా నిలిచారు.
షాద్నగర్కు చెందిన ఐశ్వర్య రెడ్డి కుటుంబానికి రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. సివిల్స్కు ప్రిపేర్ అవుతున్న ఐశ్వర్య.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా గత నవంబర్ నెలలో ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. లాక్డౌన్ కాలంలో ఫీజులు చెల్లించలేక ఢిల్లీలోని హాస్టల్లో ఐశ్వర్య ఈ దారుణానికి ఒడిగట్టింది. ఐశ్వర్య మరణానంతరం ఆమె కుటుంబం తీవ్ర ఇబ్బందుల పాలైంది. ఈ విషయం కేటీఆర్ దృష్టికి రావడంతో.. తక్షణమే స్పందించి ఐశ్వర్య కుటుంబానికి బాసటగా నిలిచారు. ఇవాళ ఐశ్వర్య తల్లిదండ్రులను ప్రగతి భవన్కు పిలిపించి రూ. 2.50 లక్షలను కేటీఆర్ అందించారు. షాద్నగర్లో డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరుకు కేటీఆర్ హామీ ఇచ్చారు. భవిష్యత్లోనూ ఆమె కుటుంబానికి అండగా ఉంటామని కేటీఆర్ భరోసానిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్కు ఐశ్వర్య తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.