KTR | మోదీ, అమిత్ షా ఎన్ని అబద్ధాలాడినా.. బీజేపీకి తిరస్కారం తప్పదని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. ఆదిలాబాద్ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలపై ఆయన ధ్వజమెత్తారు. అబద్దాల అమిత్షా పార్టీకి రాష్ట్రంలో గుణపాఠం తప్పదన్నారు. అమిత్షా ప్రసంగమంతా అబద్దాలేనని.. తెలంగాణ ఎన్నికల్లో మళ్లీ బీజేపీకి 110 స్థానాల్లో డిపాజిట్ గల్లంతు ఖాయమన్నారు. పరివార్ వాద్ అంటూ అమిత్షా మాట్లాడితే ప్రజలు పరిహాసం చేస్తున్నారన్న కేటీఆర్.. ఏ క్రికెట్ కప్ సాధించారని జైషా బీసీసీఐ పదవిలో ఉన్నారని నిలదీశారు.
అమిత్షా కుమారుడు క్రికెట్ ఎప్పుడు ఆడారో స్పష్టం చేయాలన్నారు. పదేళ్లలో రాష్ట్రానికి బీజేపీ ఒక్క విద్యా సంస్థ ఇవ్వలేదన్నారు. తెలంగాణలో మత రాజకీయాలు చెల్లవని, రైతుల ఆత్మల్లో తెలంగాణ అగ్రస్థానమన్న అమిత్షా వ్యాఖ్యలు అసత్యమన్నారు. రైతు సంక్షేమం దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరిస్తామని.. ఐదేళ్ల కిందట ఆదిలాబాద్ సభలో అమిత్షా ఇచ్చిన హామీ ఏమైంది ప్రశ్నించారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకునే సత్తా లేని ప్రభుత్వమని.. బీజేపీ కేంద్రంలో ఉండడం తెలంగాణ ప్రజల దురదృష్టమన్నారు. యూనివర్సిటీకి భూమి కేటాయించలేదు అనే పూర్తిగా అబద్ధమన్నారు. తెలంగాణకు కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ విద్యాలయం, కేజీబీవీ కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. బీజేపీని నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని, తెలంగాణ ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెప్పారన్నారు. అదానీ గురించి మాట్లాడమంటే ప్రధానికి ఎందుకు నోరు పెరగలదని.. మా స్టీరింగ్ బా చేతుల్లోనే ఉంది.. బీజేపీ సీర్టింగ్ అదానీ చేతుల్లో ఉందన్నారు. రైతు సంక్షేమంలో తెలంగాణ అగ్రస్థానంలోనే ఉందన్న కేటీఆర్.. ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకే అమిత్షా అబద్ధాలు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.