హైదరాబాద్: ఐటీశాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 10వ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్లో విషెస్ చెబుతూ ఓ కవితను ట్వీట్ చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ ఓ యోధుడిలా పోరాడారని, ఈ రాష్ట్రానికి ఆయనే పాలకుడయ్యారని, ఆ సాధించిన తెలంగాణను సగర్వంగా.. దేశంలోనే అగ్రపథాన నిలిపినట్లు పేర్కొన్నారు. తెలంగాణ నేల దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతున్నట్లు కేటీఆర్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఉద్యమకాలం నాటి ఓ ఫోటోను ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.. కేవలం పదేళ్లలోనే తెలంగాణ రాష్ట్రం వందేళ్ల ప్రగతికి సాక్షిగా నిలిచినట్లు తెలిపారు.
పోరాట యోధుడే పాలకుడై..
సాధించిన తెలంగాణను సగర్వంగా…
దేశంలోనే సమున్నతంగా నిలిపిన వేళ…దశాబ్ది వేడుకలను
ఘనంగా జరుపుకుంటోంది
మన తెలంగాణ నేల…కేవలం పదేళ్లలోనే…
వందేళ్ల ప్రగతికి సజీవ సాక్షిగా నిలిచిన..
తెలంగాణ తోబుట్టువులందరికీ..రాష్ట్ర అవతరణ
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా… pic.twitter.com/IGn7zcXFaS— KTR (@KTRBRS) June 2, 2023