హైదరాబాద్ : కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ సాయన్న మృతికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సాయన్న కంటోన్మెంట్ ప్రజల శ్రేయస్సు కోసం శ్రమించారని, ఆయన మృతి తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. పలువురు మంత్రులు సైతం సాయన్న మృతికి సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు.
సాయన్న మృతిపై మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు సాయన్నకు ఉందని, ఎప్పుడూ ప్రజలతో మమేకమై సమస్యలు పరిష్కరించే వారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. అలాగే మంత్రులు కొప్పుల ఈశ్వర్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్తో పాటు పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. ఎమ్మెల్యే సాయన్న మరణం బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని పేర్కొన్నారు.
My wholehearted condolences to the family and friends of BRS MLA Sri @SayannaMLA Garu on his sudden demise
He was a very humble and polite leader who always toiled for the well being of people of Secunderabad Cantonment
May his soul rest in peace 🙏
— KTR (@KTRBRS) February 19, 2023