తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఉమ్మడి రాష్ట్రంలో ఐదు సార్లు శాసనసభ సభ్యులు గా, మంత్రి గా సేవలను అందించిన మాజీ మంత్రి శ్రీ బొజ్జల గోపాలకృష్ణ గారి మృతి పట్ల తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. బొజ్జల గోపాలకృష్ణ గారి పార్థివ దేహానికి నివళులర్పించిన అనంతరం, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
టీడీపీ సీనియర్నాయకుడు, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి(72) గుండెపోటుతో మృతి చెందారు. ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి 4 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేర్కొందిన బొజ్జల చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు. ఇవాళ అస్వస్థతకు గురై అపస్మారక స్థితికి వెళ్లడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని హుటాహుటిన అపోలో చేర్పించారు. ఆస్పత్రిలో డాక్టర్లు సీపీఆర్ ద్వారా చికిత్స అందించినప్పటికి ఆయన తుదిశ్వాస విడిచారు.