న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం సృష్టిస్తున్నది. ఈ మహమ్మారి ఏ ఒక్కరిని విడిచిపెట్టడం లేదు. ఇండియన్ రైల్వేస్లో సుమారు 93 వేల మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో సునీత్ శర్మ వెల్లడించారు. ఈ కేసుల సంఖ్య గత కొద్ది వారాల నుంచి తీవ్రమైందని పేర్కొన్నారు. కరోనా బారిన పడ్డ రైల్వే ఉద్యోగులకు రైల్వేస్కు సంబంధించిన 72 ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోందని, 5 వేలకు పైగా పడకలను సిద్ధంగా ఉంచామన్నారు. కరోనా తీవ్రత తక్కువగా ఉన్న ఉద్యోగులు హోం ఐసోలేషన్లో ఉంటూ వైద్యుల సూచనలను పాటిస్తున్నట్లు చెప్పారు. రైల్వేలో ఫ్రంట్ లైన్ వర్కర్లు అయినా డ్రైవర్లు, గార్డ్స్, మెయింటెనర్స్, స్టేషన్ మాస్టర్లు, టీటీఈలతో పాటు స్టేషన్ సిబ్బంది విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.