వరంగల్: ప్రపంచపటంలో ఐటీ రంగానికి ఐకాన్ మంత్రి కేటీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడానికి నిరంతరం కృషి చేస్తున్న మహోన్నత వ్యక్తన్నారు. అలాంటి నాయకుడు అరుదని, నేటి యువతరానికి కేటీఆర్ ఆదర్శంగా నిలుస్తారని చెప్పారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో వరంగల్ కోటలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరైన కేక్ కట్చేశారు. అనంతరం మాట్లాడుతూ.. వరంగల్ కోటలో మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. కేటీఆర్ అంటే అందరికి ఇష్టమని చెప్పారు.
ఈ సందర్భంగా నిర్వహించిన లేజర్ షో, కేటీఆర్పై ప్రత్యేకంగా రూపొందించిన ఆడియో అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మెన్ సుందర్ రాజ్ యాదవ్, కార్పొరేటర్లు, టీఆరెఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.