KTR | హైదరాబాద్ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah )కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) ట్వీట్ చేశారు. సీఆర్పీఎఫ్( CRPF ) ఉద్యోగ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కోరారు. ఈ పరీక్షలను కేవలం ఇంగ్లీష్, హిందీ భాష( Hindi Language ) ల్లోనే నిర్వహిస్తున్నారు. తెలుగు( telugu ), తమిళం, మలయాళం, కన్నడతో పాటు గుర్తింపు పొందిన భాషల్లోనూ నిర్వహించాలన్నారు.
ఇంగ్లీష్ మీడియం చదవని అభ్యర్థులతో పాటు హిందీయేతర రాష్ట్రాల అభ్యర్థులకు తీవ్ర ఇబ్బందిగా మారిందన్నారు. కాంపిటిటీవ్ ఎగ్జామ్స్ను 12 భాషల్లో నిర్వహించాలని జాతీయ నియామక సంస్థ చెప్పింది. కానీ సీఆర్పీఎఫ్ నియామక నోటిఫికేషన్లో ఆ విధానాన్ని అమలు చేయడం లేదని కేటీఆర్ గుర్తు చేశారు.