హైదరాబాద్ : ప్రజల నిత్యావసర పనిముట్ల తయారీలో ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ వర్క్స్ ఎంతో పురోగతి సాధిస్తోంది అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. అందుకు నిదర్శనం వరంగల్ జిల్లాలో టీవీ మెకానిక్గా పనిచేస్తున్న రాజులోని నైపుణ్యాన్ని గుర్తించి కొత్తగా ఉత్పత్తులను తయారు చేసేలా చేయడంలో టీ వర్క్స్ ఎంతో తోడ్పడుతోంది అని పేర్కొన్నారు.
రాజు ఆలోచనకు అనుగుణంగా వాడేసిన వస్తువులను ఉపయోగించి ఎలక్ట్రిక్ వాహనాన్ని రూపొందించారని, ఇలాంటి ఆవిష్కర్తలకు టీవర్క్స్ కేంద్రంగా మారిందని టీ-వర్క్స్ సీఈఓ సుజయ్ కారంపూడి ట్విట్టర్లో ప్రస్తావించారు. ఈ ట్వీట్పై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ టీవర్క్స్ ద్వారా భౌతికంగా ఉత్పత్తులను తయారు చేయిస్తూ అద్బుతమైన పురోగతి సాధిస్తున్నారంటూ మంత్రి ప్రశంసించారు.
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన దేశంలోనే అది పెద్ద ప్రోటో టైపింగ్ కేంద్రంగా టీ వర్క్స్ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆవిష్కర్తలు తమ ఆలోచనలకు అనుగుణంగా ఇక్కడ పనిచేసే ఉత్పత్తులను తయారు చేసేందుకు మంచి వేదికగా మారిందని టీవర్క్స్ సీఈఓ సుజయ్ తెలిపారు. ఉత్పత్తుల తయారీలో అనువజ్ఞులైన తయారీదారుల పర్యవేక్షణలో అవసరమైన నైపుణ్యాలను నేర్పించడంతో పాటు అత్యంత ఆధునాతన పరికరాలను తయారుచేసే కేంద్రంగా టీ-వర్క్స్ను తీర్చిదిద్దామని తెలిపారు.
Fabulous progress 👏 https://t.co/9mspbUzH0X
— KTR (@KTRTRS) January 13, 2023