హైదరాబాద్ : రోడ్డుపై దొరికిన బంగారు ఆభరణాల బ్యాగును పోలీసులకు అప్పజెప్పి నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ జాకీర్ను మంత్రి కేటీఆర్ అభినందించారు. ఎంతో అద్భుతమైన పని చేశాడని, అతని నిజాయితీని చూసి సంతోషిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా.. నగరంలోని లంగర్హౌస్ కు చెందిన మీర్జా సుల్తాన్ బేగ్, సమీరాబేగం దంపతులు మెహిదీపట్నంలో బంగారు నగలు కొనుగోలు చేశారు. అనంతరం బైక్పై లంగర్హౌస్కు తిరుగు పయాణమయ్యారు. మార్గమధ్యంలో నగలున్న బ్యాగు ఎక్కడో పడిపోయింది. ఇంటికి వెళ్లాక ఆ విషయాన్ని గమనించిన దంపతులు పోలీసులను ఆశ్రయించారు.
ఆసిఫ్నగర్కు చెందిన ఆటో డ్రైవర్ సయ్యద్ జకీర్కు పిల్లర్ నెంబర్ 55 వద్ద ఓ బ్యాగు దొరికింది. దాన్ని ఓపెన్ చేసి చూడగా.. దాదాపు రూ.5లక్షల విలువైన 10తులాల బంగారు నగలు ఉన్నట్లు గుర్తించి.. వెంటనే పోలీస్స్టేషన్కు వెళ్లి నగలను పోలీసులకు అందించాడు. అప్పటికే బాధితులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా.. వారికి సమాచారం అందించి, ఇన్స్పెక్టర్ సమక్షంలో బాధితులకు నగలను అందించారు.
What a fabulous job Zakir 👏 So pleased to see this act of honesty https://t.co/IFtt46YgQQ
— KTR (@KTRTRS) February 9, 2022