కరీంనగర్ : జిల్లాలోని తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆదివారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీసమేతంగా దర్శించుకున్నారు. వారికి అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కొప్పుల దంపతులు వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామి దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు.
ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధిపై దేవాలయ ఈవో ముద్దసాని శంకర్, గ్రామ సర్పంచ్ శోభతో మంత్రి చర్చించారు. ఏదైనా సహకారం కావాలంటే తనని సంప్రదించాలని మంత్రి సూచించారు.