హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ నెల 21న అధికారికంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనాలని మెథడిస్ట్ చర్చి బిషప్ ఎంఏ డానియల్ను మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆహ్వానించారు. సోమవారం అబిడ్స్లోని బిషప్ హౌస్కు వెళ్లి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్సహా పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా క్రిస్టియన్ల కోసం తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న పథకాలపై బిషప్ డానియల్ సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి వెంట జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్సాగర్, శంకర్ లూక్, మైనార్టీ కార్పొరేషన్ ఎండీ క్రాంతి వెస్లీ తదితరులు ఉన్నారు.
వేడుకల ఏర్పాట్లపై సమీక్ష
ఎల్బీ స్టేడియంలో జరిగే క్రిస్మస్ వేడుకలకు అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి కొప్పుల ఆదేశించారు. స్టేడియం లో సోమవారం ఆయన అన్ని ప్రభుత్వ శాఖ ల అధికారులతో సమావేశం నిర్వహించారు. వేడుకల్లో పాల్గొనే వారికి అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఎల్బీ స్టేడియంలో ఈ నెల 21న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే క్రిస్మస్ వేడుకకు జరుగుతున్న ఏర్పాట్లు