యాదాద్రి భువనగిరి : భువనగిరి(Bhuvanagiri )లో రూ.100 కోట్లతో స్టేడియం నిర్మించి జాతీయస్థాయిలో హైదరాబాద్ తర్వాత ఇక్కడ క్రీడలు నిర్వహించే విధంగా ఏర్పాటు చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి(Minister Komati Reddy) అన్నారు. కలెక్టరేట్లో పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బస్వాపూర్, మోడల్ క్రికెట్ స్టేడియం, భువనగిరి మున్సిపాలిటీ గురించి అధికారులతో చర్చించామన్నారు.
భువనగిరి ఖిల్లా రోప్వే(Bhuvanagiri Hill Ropeway) పనులకు తొందరలోనే టెండర్లు పిలుస్తామని పేర్కొన్నారు. కొలనుపాక వద్ద వాగు పై రూ.17 కోట్లతో నిర్మాణం చేపడుతామని చెప్పారు. స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేసి, టూరిజం స్పాట్గా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు.