సూర్యాపేట : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో (Manifesto )అమలు ఎలా సాధ్యమో ప్రజలకు చెప్పాలని సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy ) అన్నారు. సూర్యాపేటలో 21న సీఎం కేసీఆర్ పర్యటనను పురస్కరించుకొని పట్టణంలోనీ పాలు ప్రాంతాల్లో సభా స్థలాలను పరిశీలించిన అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఎవరిని కాపీ కొట్టలేదు.
ఆల్రెడీ మేము ప్రజా రంజక పథకాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఎందుకు గుజరాత్లో ప్రచారం చేయలేదని ప్రశ్నించారు. మునుగోడు ప్రజలు ఇప్పటికే బండకేసి కొట్టారు. ఈసారి కూడా అదే గతి మళ్లీ పునరావృతం అవుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం అంటే భయపడ్డారు. నేడు బీఆర్ఎస్ పాలనలో ఆకలి చావుల నుంచి అద్భుతమైన ప్రగతి సాధించామన్నారు. వారంటీ అయిపోయిన పార్టీ కాంగ్రెస్. ప్రజలకు ఏదీ చేయాలన్న కేసీఆరేతోనే సాధ్యమని స్పష్టం చేశారు.