హైదరాబాద్ : రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి జన్మదినం నేడు. 56 వసంతాలు పూర్తి చేసుకుని 57వ పడిలోకి అడుగిడారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి జగదీశ్రెడ్డి సీఎం కేసీఆర్ను ప్రగతిభవన్లో కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఎంపీ సంతోష్కుమార్ మంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేక రోజున మొక్కలు నాటాల్సిందిగా మంత్రిని కోరారు. సీఎం కేసీఆర్ హరిత తెలంగాణ కల సాకారం దిశగా మీరు, మీ అనుచరులు మొక్కలు నాటాల్సిందిగా సంతోష్కుమార్ మంత్రిని కోరారు. పలువురు మంత్రులు, ఎమ్మల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు మంత్రి జగదీశ్రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.