నాంపల్లి, ఆగస్టు 25 : సాగు, తాగు నీరందించడానికి నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం లక్ష్మణాపురంలో నిర్మిస్తున్న కిష్టరాంపల్లి ప్రాజెక్టులో భూమిని కోల్పోతున్న నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో ప్రాజెక్టులో భూమి ని కోల్పోతున్న నిర్వాసితులు హైదరాబాద్లో మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావును కలిశారు. ఈ సందర్భంగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందక భూ నిర్వాసితులు ఇబ్బందులకు గురవుతున్నారని కూసుకుంట్ల మంత్రి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఆయన కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు.
వెంటనే ప్రాజెక్టు దగ్గరికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని వారంలోగా పరిష్కరించాలని కలెక్టర్కు సూచించారు. అనంతరం మంత్రి జగదీశ్రెడ్డి భూనిర్వాసితులతో మాట్లాడు తూ..‘మిమ్మల్ని సాకుగా చూపిస్తూ లబ్ధిపొందాలనుకుంటున్న కొందరి నాయకుల మాయలో పడొద్దు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతీది అందేలా నేను చూసుకుంటా’నని భరోసానిచ్చారు. కార్యక్రమంలో మర్రిగూడ ఎంపీపీ మెండు మోహన్రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్రెడ్డి, నాంపల్లి రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.