Minister Jagadish Reddy : దేశం యావత్తు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నాయకత్వాన్ని, ఆయన విజన్ను కోరుకుంటున్నారని విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి( Minister Jagadish Reddy) అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు కనబడటం లేదని ఆయన కాంగ్రెస్, బీజేపీ నేతలను విమర్శించారు. ఐటీ మంత్రి కేటీఆర్(IT Minister KTR)తో కలిసి జగదీష్ రెడ్డి ఇవాళ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి (Tungathurthy) నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ప్రగతి నివేదన సభకు హాజరయ్యారు. హైదరాబాద్లో అభివృద్ధి చూస్తే కేటీఆర్ సత్తా ఏంటో ప్రతిపక్షాలకు తెలుస్తుందని మంత్రి అన్నారు.
మంత్రిగా అద్భుతమైన పని తీరుతో కేటీఆర్ దేశంలో గొప్ప పేరు, ప్రఖ్యాతలు తెచ్చుకున్నారని జగదీష్ రెడ్డి చెప్పారు. అంతేకాదు మహారాష్ట్ర(Mahrashtra)లో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తున్నదని, దేశం యావత్తు బీఆర్ఎస్(BRS) పథకాలు కోరుకుంటోందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, జిల్లా జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.