Minister Indrakaran Reddy | నిర్మల్ : తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( MLC Kavitha ) జన్మదిన వేడుకలను నిర్మల్ జిల్లా( Nirmal Dist )లో ఘనంగా నిర్వహించారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి( Minister Indrakaran Reddy ) ముఖ్యతిధిగా పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈడీ విచారణను ఎదుర్కొంటున్న కవితకు సంఘీభావం తెలిపారు. బీజేపీ వైపల్యాలను బలంగా ఎండగడుతున్నందుకే మహిళా అని కూడా చూడకుండా కక్ష కట్టారని, ప్రణాళికా బద్దంగా కవితను టార్గెట్ చేసి, అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. దర్యాప్తు సంస్థలపై గౌరవంతోనే కవిత ఈడీ విచారణకు హాజరయ్యారని, విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని చెప్పారు. ధైర్యంగా పోరాటం చేస్తున్న కవితను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. తెలంగాణ సమాజం మీ వెంటే ఉందని అధైర్యపడవద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, నిర్మల్ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు మారుగొండ రాము, మున్సిపల్ కౌన్సిలర్లు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.