నిర్మల్ : ఓడిపోతామనే భయంతోనే బీజేపీ(BJP) దాడులకు పాల్పడుతుందని నిర్మల్(Nirmal) బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy )అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్కు వస్తున్న ఆదరణను సహించ లేక పోతున్నారు. బీజేపీ కార్యకర్తలే బీఆర్ఎస్ శ్రేణులపై దాడి చేశారని ఆరోపించారు. ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా ఇలాగే దాడులు చేశారని గుర్తు చేశారు.
ఎవరేంటో నిర్మల్ ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు సంయమనం పాటించాలని సూచించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నిర్మల్లో ఎగిరేది గులాబీ జేండాయేనని స్పష్టం చేశారు. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నిర్మల్ పట్టణంలోని వైయస్సార్ కాలనీలో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు నడుమ గొడవ జరిగింది. పరస్పరం ఒకరిపై మరొకరు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు.