హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : మంచి ఆరోగ్యానికి నడక, వ్యాయామమే సరైన మార్గమని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని మహవీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 4కే రన్ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 4కే రన్ లాంటి కార్యక్రమాలను నిర్వహించి ప్రజల్లో నడక, సహజ ఆరోగ్య చైతన్యం తేవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. పట్టణ, నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచటంతో పాటు పర్యావరణ పరిరక్షణ, అటవీ భూముల సంరక్షణ కోసం ఫారెస్ట్బ్లాకుల్లో అర్బన్లంగ్స్ స్పేస్ (అర్బన్ ఫారెస్ట్ పారులు)ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ అర్బన్ పారుల్లో వాకింగ్తోపాటు ఆహ్లాదం, ఆనందం కోసం వీకెండ్లో సందర్శకులు సేద తీరుతున్నారని చెప్పారు. కొత్తగూడలోని కోట్ల విజయ భాసర్రెడ్డి బొటానికల్ గార్డెన్ను ఉమ్మడి పాలనలో వాణిజ్య అవసరాలకు లీజుకిస్తే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దాన్ని ఎకో టూరిజం పారుగా అభివృద్ధి చేశామని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే, మూసీ రివర్ బోర్డు చైర్మన్ సుధీర్రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.