హైదరాబాద్: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శేషాద్రి తన తుది శ్వాస వరకు స్వామి వారి సేవలో తరించారని, టీటీడీలో ఆయన లేనిలోటు తీర్చలేనిదన్నారు.
డాలర్ శేషాద్రి సోమవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. కార్తిక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన విశాఖపట్నం వెళ్లారు. అయితే సోమవారం తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో దవాఖానకు తరలించేలోపే తుదిశ్వాస విడిచారు.
1978 నుంచి డాలరు శేషాద్రి శ్రీవారి సేవలో పాల్గొంటున్నారు. 2007లో పదవీ విరమణ చేశారు. అయితే శేషాద్రి సేవలను గుర్తించిన టీటీడీ.. ఆయనను ఓఎస్డీగా కొనసాగిస్తున్నది.