సూర్యాపేట : రైతాంగం అధిక ఆదాయం వచ్చే ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూచించారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలో మధర్ థెరిస్సా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.20లక్షల వ్యయంతో నిర్మించిన రైతు ఉత్పత్తిదారుల సంఘం నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన రైతు సదస్సులో మంత్రి మాట్లాడారు. సమృష్టి వ్యవసాయ అభివృద్ధిపై రైతాంగం దృష్టి సారించాలన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం వ్యవసాయానికి అవసరమైన నీరు, విద్యుత్ను సమృద్ధిగా అందుబాటులో ఉంచిందన్నారు.
భూసారం కాపడడంపై దృష్టి పెట్టడంతో పాటు అధిక దిగుబడులు లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రైతు ఉత్పత్తి కేంద్రాలను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 324 రైతు ఉత్పత్తి కేంద్రాలు ఉండగా.. సూర్యాపేట జిల్లాలో నాలుగు ఉన్నాయని అందులో ఆత్మకూరులో రెండు సంఘాలు కోటి 60 లక్షల రూపాయల మేర వ్యాపారం చేయడం స్వాగతించదగ్గ అంశమన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, ఎంపీపీ పీ మర్ల స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.