నిర్మల్, సెప్టెంబర్ 20 : సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 తేదీ వరకు జరుగనున్న బాసర జ్ఞాన సరస్వతీ దేవి శరన్నవరాత్రుల (దసరా) మహోత్సవాల పోస్టర్ను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రిని ఆలయ అర్చకులు శాలువాతో సత్కరించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో బాసర ఆలయ పూజారులు, తదితరులు పాల్గొన్నారు.