హైదరాబాద్ : పోలీసు ఉద్యోగాల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్పై ట్విట్టర్ వేదికగా వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పందించారు. యువత సరైన విధంగా పరీక్షలకు సన్నద్ధమై.. ప్రభుత్వ ఉద్యోగం సాధించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటున్నట్టు హరీశ్రావు పేర్కొన్నారు.
తెలంగాణ యువత బంగారు భవిష్యత్కై సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే పోలీసు డిపార్ట్మెంట్లో 587 ఎస్ఐలు, 16,027 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని హరీశ్రావు తన ట్వీట్లో పేర్కొన్నారు.
యువత సరైన విధంగా పరీక్షలకు సన్నద్ధమై ప్రభుత్వ ఉద్యోగం సాధించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ…
All the Best
2/2— Harish Rao Thanneeru (@trsharish) April 25, 2022