సిద్దిపేట : రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట ఈద్గా వద్ద నిర్వహించిన రంజాన్ వేడుకల్లో మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ పాల్గొన్నారు. రంజాన్ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు సంతోషంగా జరుపుకుంటున్నారని తెలిపారు.
ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. పేద ముస్లిం ఆడపిల్లల వివాహాల కోసం షాదీముబారక్ పథకం తెచ్చామన్నారు. పేద ముస్లిం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను స్థాపించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలను సమానంగా గౌరవిస్తుందని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.