‘మంచు కొండల్లో అన్నదానం చేయడం గొప్ప సంకల్పం.. శివ భక్తులకు సేవ చేస్తే పరమ శివుడికి సేవ చేసినట్టే’ అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు కొనియాడారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శరభేశ్వర ఆలయంలో ఆదివారం కేదార్నాథ్ అన్నదాన సమితి ఆధ్వర్యంలో కేదార్నాథ్కు వెళ్లే ఆహార పదార్థాల వాహనానికి మంత్రి హరీశ్రావు పూజలు చేశారు. అనంతరం జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించారు.
– సిద్దిపేట టౌన్