హుజూరాబాద్, సెప్టెంబర్ 9: కేంద్రం రైతులను నడ్డివిరిచే నల్ల చట్టాలు తెచ్చిందని.. కరోనా కాలంలో రాష్ర్టానికి సహాయం చేయడం లేదంటూ ఒకప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించిన ఈటల రాజేందర్ ఇప్పుడు ఆ పార్టీ తరఫున ఓట్లెలా అడుగుతాడని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని రైతులు, ప్రజల వద్దకు వెళ్తాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన సానుభూతి మాటలను నమ్మి మోసపోవద్దని హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. 2004లో రాజకీయ ఉద్దండుడు దామోదర్రెడ్డికి పట్టినగతే నేడు బీజేపీ నేత ఈటల రాజేందర్కు పడుతుందని.. గెల్లు శ్రీనివాస్ చేతిలో ఘోర పరాజయం తప్పదన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సమీపంలోని రంగనాయకులగుట్ట వద్ద పెద్దమ్మగుడి నిర్మాణానికి మంత్రి గంగుల కమ లాకర్తో కలిసి హరీశ్రావు భూమిపూజ చేశా రు. హుజూరాబాద్కు చెందిన పేద బ్రాహ్మణు డు రేవూరి వెంకటరామారావుకు బ్రాహ్మణ పరిషత్ బెస్ట్సీమ్ కింద మంజూరైన ఎర్టిగా వాహనాన్ని అందజేశారు. అనంతరం విశ్వకర్మల ఆత్మీయ సమ్మేళనానికి మాజీ స్పీకర్ మధుసూదనాచారితో కలిసి హాజరయ్యారు. ఆయాచోట్ల హరీశ్రావు మాట్లాడుతూ.. ప్రభు త్వ సంస్థలను ప్రైవేట్పరం చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నదని ఆరోపించారు. గతంలో పదవులను అనుభవించి ఏమీ చేయలేని ఈటల.. రేపు ఎమ్మెల్యేగా గెలిచి ఏమి చేస్తాడో ప్రజలు ఆలోచించాలని సూచించారు. రాజేందర్ మంచిగా పనిచేస్తే.. ఇవాళ బొట్టు బిళ్లలు, గడియారాలు, కుట్టుమెషిన్లు పంచాల్సిన గతి ఆయనకు ఎందుకు వస్తుందని ప్రశ్నించారు.
ఈటల రాజేందర్ కొడుతున్న సెంటిమెంట్ డైలాగులతో కడుపు నిండదని.. పనిచేస్తున్న ప్రభుత్వానికి మద్దతు పలికితేనే లాభం జరుగుతుందని హరీశ్రావు సూచించారు. ధరలు పెంచే బీజేపీ కావాలా.. పేద ప్రజలను ఆదుకునే టీఆర్ఎస్ కావాలా? ఆలోచించుకోవాల ని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లును గెలిపిస్తే ఇక్కడి అభివృద్ధి బాధ్యత తాము తీసుకుంటామని హామీఇచ్చారు. బీజేపీకి ఓటువేస్తే గ్యాస్ ధర పెరుగుతుందని చెప్పారు. గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపిస్తామని విశ్వకర్మలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు.
ముదిరాజ్లపై సీఎం కేసీఆర్కు ఎనలేని ప్రేమ ఉన్నదని, అడిగిందే తడవుగా రూ.2కోట్ల నిధులను మంజూరు చేశారని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఇందులో రూ.కోటితో చిలుకవాగుపై బ్రిడ్జి, రహదారి అభివృద్ధికి రూ.60 లక్షలు, గుడి నిర్మాణానికి రూ.40 లక్షలు కేటాయించామని తెలిపారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన ముదిరాజ్లను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారని చెప్పారు.
హుజూరాబాద్ ఉపఎన్నికలో తనను నిండు మనసుతో ఆశీర్వదించాలని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని చెప్పారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండని, ప్రజాసేవ అంటే ఎలా ఉంటుందో చేసి చూపెడుతానని స్పష్టం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.