హైదరాబాద్ : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని కోనారెడ్డి చెరువు శాశ్వత మరమ్మతులకు పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.2 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి సైతం శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో వరంగల్ ఎంపీ దయాకర్, జడ్పీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే రమేశ్, కలెక్టర్ గోపి, మున్సిపల్ చైర్ పర్సన్ అరుణ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆలూరి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రులు హరీశ్రావు, దయాకర్రావు ప్రసంగించారు.