హైదరాబాద్, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ): అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తిచేసి రోగులకు పునర్జన్మ ప్రసాదిస్తున్న నిమ్స్ వైద్య బృందాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అభినందించారు. ఇటీవల నిమ్స్లో ముగ్గురు రోగులకు నిర్వహించిన అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయి. వీటిపై ‘నమస్తే తెలంగాణ’ రాసిన కథనాన్ని మంత్రి తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.