హుజురాబాద్ : అట్టడుగున ఉన్నవారికి తెలంగాణ దళిత బంధు పథకం అత్యున్నత ఆసరా అని మంత్రి హరీశ్రావు అన్నారు. అరకొర సాయాలతో దళితుల పురోగతి సాధ్యం కాదని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దార్శినికతకు ఈ పథకం నిదర్శనం అని అన్నారు. ఆయన ఈ మేరకు ట్విట్ చేశారు. ఇది తెలంగాణ చరిత్రను తిరగరాసే పథకం అవుతుందని ఆయన వెల్లడించారు.
రూ. 10లక్షల ఆర్ధిక సాయమే కాదు, ప్రభుత్వ కాంట్రాక్టులు, వ్యాపార లైసెన్సుల్లోనూ దళితులకు కోటా ఇవ్వడం దేశ చరిత్రలోనే ప్రథమం కావడం తెలంగాణాకే గర్వకారణం అని హరీశ్ రావు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రారంభమైన ఈ సామాజిక న్యాయ విప్లవం మునుముందుకే సాగుతుందని ఆయన పేర్కొన్నారు.