కరీంనగర్ : హిందూ, ముస్లింలు కలిసి ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. మత సామరస్యాన్ని పెంపొందించి అభివృద్ధి సాధించామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. బుధవారం కరీనంగర్లో మంత్రి కేటీఆర్తో కలిసి బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వరుసగా మూడు సార్లు నన్ను గెలిపించారు.
నాకంటే ముందు అనేకమంది మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పని చేశారు. అయిసా కరీంనగర్లో అభివృద్ధి శూన్యం అన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో కోటి రూపాయలు నిధులు ఇవ్వమంటే ఇవ్వలేదు. నేడు బీఆర్ఎస్ పాలనలో రూ.300 కోట్లతో కరీంనగర్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. దేశంలోనే కేసీఆర్కి సరితూగే నాయకుడు లేడన్నారు.
రాష్ట్రాన్ని ఢిల్లీ పాలకుల చేతుల్లో పెడితే మన భవిష్యత్ ఆగం అవుతుందని పేర్కొన్నారు. కౌన్సిలర్గా, కార్పొరేటర్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నా, ఏ పదవిలో ఉన్నా ప్రజల మధ్యనే ఉన్నాను. మరోసారి గెలిపిస్తే మరింతగా అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు.