కరీంనగర్ : అభివృద్ధిని చూసి ఓటేయాలని, పనిచేసే ప్రభుత్వాన్ని దీవించాలని, మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. ఆదివారం కరీంనగర్లో భగత్ నగర్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్(BRS) పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. గతంలో మూడు సార్లు తనకు అవకాశమిస్తే కరీంనగర్ను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు.
ఈ సారి అవకాశమిస్తే మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రజాసంక్షేమ పాలన అందిస్తున్న ప్రభుత్వానికే ప్రజలు పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్లు తోట రాములు, ఆకుల నర్మద, కోల సంపత్ రెడ్డి, సంఘం నాయకుడు అధ్యక్షుడు సంధి అనంతరెడ్డి, జలపతి రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి కనుక రెడ్డి కృష్ణారెడ్డి, రంగారెడ్డి, తదితరులు ఉన్నారు.