కరీంనగర్ : పేదల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం మాదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్ నియోజవర్గం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం రాకముందు, రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని అన్నారు.
తెలంగాణ రాకమందు కరీంనగర్ ఉంది ప్రభుత్వాలు ఉన్నాయి. సీఎం, పీఎంలు ఉన్నారు
కానీ, తెలంగాణ రాకముందు కరీంనగర్ ఎలా ఉందో వచ్చిన తర్వాత ఎలా ఉందో ఆలోచించుకోవాలి అన్నారు. తెలంగాణ వస్తే కరెంటు ఉండదని, హిందూ ముస్లింల గొడవలతో శాంతిభద్రతలు లేకుండా పోతాయని పరిస్థితులు భయంకరంగా ఉంటాయని భయాందోళనకు గురి చేశారన్నారు.
కాంగ్రెస్ పాలనలో హిందూ, ముస్లింల మధ్య గొడవలు పెట్టి తమాషా చూసేవారని, హిందూ ముస్లింలు కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యం అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో శాంతిభద్రతలు భేషుగ్గా ఉన్నాయని,శాంతి భద్రతలు లేని చోట అభివృద్ధి కుంటుపడుతుందన్నారు.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు, ఆర్డీవో మహేశ్వర్, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, కొత్తపల్లి మున్సి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, చల్ల హరి శంకర్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.