హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్(Sai Chand) అకాల మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) అన్నారు. తెలంగాణ ఉద్యమం(Telangana Agitation)లో తెలంగాణ ఆవశ్యకతను పాటలో రూపంలో పాడి బాహ్య ప్రపంచానికి చాటి చెప్పారని పేర్కొన్నారు. కేంద్రానికి కనువిప్పు కలిగేలా పాటలు రాసి పాడారని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం బాధకరమని అన్నారు.
సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సాయిచంద్ కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. తెలంగాణ గొప్ప సాహితివేత్తను కోల్పోయిందని అన్నారు.