హైదరాబాద్ : బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన మహాత్మా జ్యోతిబాపూలే చిరస్మరణీయుడని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పూలే వర్ధంతి సందర్భంగా బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహాత్మా పూలే ఆశయాలతో పరిపాలన సాగిస్తున్నారన్నారు.
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్రంలో కేవలం 19 నుంచి 310కు బీసీ గురుకులాలను పెంచి, మహాత్మా జ్యోతిబాపూలే పేరిట ఏర్పాటు చేశారన్నారు. ఉన్నతమైన విదేశీ విద్యను సైతం బీసీలకు అందించడమే కాకుండా ఆత్మగౌరవం నిలిచేలా హైదరాబాద్ నడిబొడ్డున వేల కోట్ల విలువ చేసే 87 ఎకరాలను 41 బీసీ కులాలకు కేటాయించి ఆత్మగౌరవ భవనాల్ని నిర్మిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనిలో బీసీల వాటాను సగర్వంగా అందిస్తున్నారని కొనియాడారు.