కరీంనగర్ : పెండింగ్లో పనులన్నింటిని పూర్తి చేయాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్లో సమావేశం కరీంనగర్ నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో గ్రామాల వారీగా చేపట్టాల్సిన, పెండింగ్ పనులపై సమీక్ష నిర్వహించారు. జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.50కోట్లు మంజూరు చేశారని, వాటిని మార్చి 31లోగా పూర్తి చేసి, ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంలో మరిన్ని నిధులు మంజూరు చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 80శాతం పనులు పనులు పూర్తయ్యాయని, మిగతా వాటిని సత్వరమే పూర్తి చేయాలన్నారు.
పంచాయతీరాజ్ నిధులతో టెండర్లు పూర్తయిన పనులను వెంటనే పూర్తి చేయాలని, మిగతా వాటికి అంచనా సిద్ధం చేయాలన్నారు. పనులపై నిర్లక్ష్యం వహిస్తే గుత్తేదారులను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని ఆదేశించారు. సంఘాల భవనాలను పూర్తి చేయాలని, మిగతా వాటికి నిధులు మంజూరు చేయిస్తామన్నారు. మంజూరు చేసిన రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేసుకోవడంతో పాటు పీఆర్ రోడ్లన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. కరెంటు లూజ్లైన్స్ సరి చేయాలని, విరిగిపోయిన స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జడ్పీ సీఈఓ ప్రియాంక, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.